నెలసరి సమస్యలు - జ్యోతిష్యం

ఈ కాలం లో చాలా మంది మహిళలు ఎదురుకునే సమస్య నెలసరి సమస్యలు.
జ్యోతిష్యం పరంగా చూస్తే చంద్రుడు కుజుడు ముఖ్య గ్రహాలు ,ఇంకా కొన్ని గ్రహాలు కూడా ప్రభావం చూపిస్తాయి.ప్రతి 28 రోజులకు చంద్రుడు కుజుడు తో కలిసినపుడు ఆడవారికి ప్రతి నెల నెలసరి వస్తుంది.ఇధి సక్రమంగా లేనపుడు మనకి irregular periods అలాగే menstrual discharge కొన్ని కాంప్లికేషన్స్ వస్తు ఉంటాయి.మనకి ప్రతి పౌర్ణమి కి సముద్రం లో నీరు అలలు ఎక్కువ అవ్వడం అమవాస్య కి నీరు తక్కువ అవ్వడం ఎలా అయితే ఉంటుందో అదే మన పైన చంద్రుడు ప్రభావం చూపిస్తారు,అమావాస్య దగ్గర్లో ఉన్నపుడు తక్కువ రక్త స్రావం ఉండడం పౌర్ణమి దగ్గర్లో ఉన్నప్పుడు ఎక్కువ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చంద్రుడు కుజుడు అనే గ్రహాలు వేరే గ్రహాల వల్ల బాధ కి గురి అవుతుంటే ...ఇలాంటి సమస్యలు ఉన్నపుడు జ్యోతిష్యం ప్రకారం చేయాల్సిన పరిహారాలు:
ప్రతిరోజూ రాత్రి ఒక గంట లేదా అరగంట అరు బయట నడవడం.
* వాళ్ళ జాతకం బట్టి చంద్రుడికి ముత్యం ధరించడం.
* కుజుడు కి పగడం ధరించడం.
* కుజ కవచం చదవడం.
* Bajrangban sotram వినడం .
* మసాలా , కారం తగ్గించి తినడం.
*Liquid foods , liquids ఎక్కువ తీసుకోవడం .
*చంద్ర మంత్రం చదవడం.
*ప్రతిరోజూ ఎరుపు రంగు పూవులతో సుబ్రమణ్య స్వామి కి పూజ చేస్తూ సుబ్రమణ్య అష్టకం చదవండి.
* ప్రతి మంగళవారం సుబ్రమణ్య స్వామి కి అంటే గుడిలో జంట నాగులు కి అభిషేకం చేయండి


జ్యోతిష్యం కాకుండా రోజు వారి మన జీవితం లో మార్పులు కూడా మన నెలసరి సమస్యలకి కారణం కావచ్చు.ఆహారం లో మార్పులు సమతుల్య ఆహారం తీసుకోకపోవడం,ఎక్కువ కారం,మసాలా వాడడం.అలాగే పాల పదార్థాలు ,తీపి తక్కువ తీసుకోవడం ,ఆకు కూరలు తక్కువ తీసుకోవడం ఇలా చాలా కారణాలు ఉండచ్చు.మన శరీరం లో పిత్త దోషాలు ఎక్కువ ఉండడం కూడా కారణం కావచ్చు ,రాత్రి నిద్రించే వేళలు ఆలస్యంగా నిద్ర పోవడం,ఉదయం ఆలస్యంగా లేవడం,శారీరక శ్రమ లేకుండా ఉండడం మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం ఇలా ఎన్నో కారణలు ఉండచ్చు.
మన నిత్య జీవితం లో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది.
* యోగ, మెడిటేషన్ ,ముద్ర లు వేయడం చేయాలి.
* ధనియాలు,జీర,బెల్లం, అరటిదూట,దానిమ్మ,ఆకు కూరలు, కర్జూరం, సిట్రస్ పండ్లు ,కూరగాయలు ఎక్కువ తినడం ,పాత బియ్యం తినడం ,నువ్వులు బెల్లం కలిపి తినడం ,ఆయిల్ తక్కువ వాడడం , మానసిక ఒత్తిడి లేకుండా ఉండడం చేయాలి.
* బియ్యం కడిగిన నీటిలో దాల్చిన చెక్క పొడి కొంచం వేసుకొని తాగితే  ఎక్కువ రక్తస్రావం అయ్యే సమస్య కొంచం తగ్గుతుంది .
* పసుపు+ నీరు కలిపి చిన్న ముద్ద చేసి ఉదయం సాయంత్రం తీసుకుంటే మంచిది.
* అవు నెయ్యి కొంచం వేడి చేసి ఉదయం లేవగానే రాత్రి పడుకునే సమయంలో బొడ్డు లో వేసుకుంటే మంచిది.
* కొత్తిమీర రసం కొంచం ఉదయం మరియు సాయంత్రం తగిన ఫలితం ఉంటుంది .

ఇలా అన్ని పాటిస్తూ మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు .ఇప్పుడు వచ్చే అన్ని జబ్బులకు ఒకే కారణం మన మానసిక ఒత్తిడి.....
అన్ని పాటిస్తారు అని ఆశిస్తూ 
- మీ రజితశ్రీ...

Comments

Post a Comment

Popular posts from this blog

జరగబోయేది ఎలాగూ జరుగుతుంది మరి జ్యోతిష్యం ఎందుకు?????

జాతకం అంత బాగున్న మనకి ఎందుకు అన్నీ కష్టాలే వస్తున్నాయి.

అమ్మ